భారతీయ జనతాపార్టీ అగ్రనేత, దేశ మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అనారోగ్య కారణాలతో రిటైర్‌మెంట్‌ దశకు చేరుకున్నా కూడా ఆయనను పార్టీ వదలడం లేదు. అక్టోబర్ నెలలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయనచేత ప్రచారం చేయించేందుకు ఉత్సుకత చూపిస్తోంది. అక్టోబర్‌‍లో జరుగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తరపును ప్రచారం చేయనున్న 40 మంది ప్రముఖుల జాబితాలో వాజ్‌పేయి పేరును కూడా చేర్చింది. పార్టీ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ఈ జాబితాలో ఎల్‌.కె. అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్‌, మురళీ మనోహర్‌ జోషి, అరుణ్‌ జైట్లీ, సుష్మాస్వరాజ్‌లతో పాటు వాజ్‌పేయి పేరు కూడా చేర్చింది. ఇదిలావుండగా ఇటీవల ఏఐసీసీ ప్రధానకార్యదర్శి రాహుల్‌ గాంధీని ప్రశంసించడం ద్వారా పార్టీలో కలకలం రేపిన బాలీవుడ్ నటుడు, లోక్‌సభ సభ్యుడు,శత్రుఘ్న సిన్హాల పేరు ప్రచారకుల జాబితాలో ఉండడం గమనార్హం. అలాగే కేంద్ర స్థాయిలో ఉన్న రాష్ట్ర నాయకులు గోపీనాధ్‌ ముండే, ప్రకాష్‌ జావెద్కర్‌లు ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి


Posted by Hollywood Actors
కాంగ్రెస్ అసలు సీనియర్లు వారి రాజకీయం బయటపడితోంది ఒకరి తరువాత ఒకరు జగన్ ని సం యమనం పాటించాలి అతనికి భవిష్యత్తు ఉంది ఇంకా ఇంతకంటే పెద్ద పదవులు చేస్తాడు మేమందరం అతనికి సపొర్ట్ ఇస్తాం అని తియ్యని పలుకులు పలుకుతు లోలోన రాజకీయం అనుభవాలు బయటపెడుతున్నారు చెప్పుకొకూడదు కాని కొంతమంది వై.యస్.పై ఉన్న కోపాన్ని చూపిస్తున్నారు నిన్న కెక్ సొనియా పోస్టర్ చించినందుకు రెచ్చిపోవడం హనుమంత రావు 48గంటలు మౌనవ్రతం చేస్తాననడం ఇవన్ని చెప్పకనే చెపుతున్నాయ్ నెమ్మ నెమ్మదిగా అందరిని వారి వైపు తిప్పిఉకొని జన అభిష్ఠాన్ని మరుగునకు తోతున్నారు సొనీయా రాజకీయ నాటకం ఆడుతు నెట్టుకొస్తోంది బానే తోసుకొచ్చింది వై.యస్.చనిపోవటంతో సినియర్ లు రెచ్చిపోతున్నారు వై.యస్.సినియార్లకి రిటైర్మెంట్ ఎందుకిస్తానంటాడో ఇప్పుడు అర్దం మవుతోంది


Posted by Hollywood Actors
ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులు ఆగడం లేదు. తాజాగా భారత టాక్సీ డ్రైవర్ పై ఆస్ట్రేలియా ఫుట్ బాల్ క్రీడాకారుడు దాడి చేశాడు. ఎస్సెండెన్ ఫుట్ బాల్ క్రీడాకారుడు మైఖెల్ హర్లీ హాడిల్ స్ట్రీట్ లోని ఫాస్ట్ ఫుడ్ ఔట్ లెట్ వద్ద భారత టాక్సీ డ్రైవర్ పై దాడి చేశాడు. దీంతో హర్లీని పోలీసులు అరెస్టు చేశారు. హర్లీ ఉదయం ఐదున్నర గంటలకు నైట్ క్లబ్ కు టాక్సీ తీసుకున్నాడు. ఆ తర్వాత ఫుడ్ అవుట్ లెట్ కు వెళ్లాడు. అతను ఆహారం కోసం టాక్సీ దిగాడు. దీంతో టాక్సీ డ్రైవర్ కిరాయి అడిగాడు. దీంతో హర్లీ ఆ టాక్సీ డ్రైవర్ పై దాడి చేశాడు.

హర్లీని సంఘటనా స్థలంలోనే పోలీసులు అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం ఫిజ్రోయ్ పోలీసు స్టేషన్ కు తీసికెళ్లారు. ఆ తర్వాత అతన్ని పోలీసులు విడుదల చేశారు. హర్లీపై కేసు నమోదు చేయవచ్చునని వార్తా కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తను రాసిన పత్రిక టాక్సీ డ్రైవర్ ను గుర్తించలేదు. అతనికి స్వల్ప గాయాలైనట్లు తెలిపింది. మైఖెల్ ఆలస్యంగా రావడం, తనను తాను ఇబ్బందుల్లో కూరుకుపోవడం అసంతృప్తికి గురి చేసిందని ఎస్సెండెన్ మేనేజింగ్ డైరెక్టర్ పీటర్ జాక్సన్ వ్యాఖ్యానించారు.




Posted by Hollywood Actors
భారత్ తొలిసారి చంద్రుడిపైకి పంపిన అంతరిక్ష నౌక (చంద్రయాన్- 1) అక్కడ నీటి జాడలు గుర్తించినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం (నాసా) గురువారం ప్రకటించింది. చందమామపై నీటి జాడలు గుర్తించడం వెనుక ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) కృషిని విస్మరించలేమని నాసా శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

చంద్రయాన్- 1లో జాబిలిపైకి వెళ్లిన 11 పరికరాల్లో నాసా రూపొందించిన మూన్ మినిరాలజీ మ్యాపర్ (ఎం3) కూడా ఉంది. ఈ ఎం3 పంపిన వివరాలను అమెరికాలోని మూడు బృందాలు విశ్లేషించాయి. శాస్త్రవేత్తల పరిశోధనల్లో జాబిలిపై నీరు ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. దీంతో ఇప్పటివరకు ఉన్న చంద్రుడి ఉపరితలం పొడిగా ఉంటుందనే భావన పటాపంచలైంది.

చంద్రుడి ఉపరితలంపై నీటి ఉనికికి సంబంధించిన స్పష్టమైన రసాయన ఆనవాళ్లు కనిపించాయి. చంద్రుడిపై నీటి జాడలు గుర్తించడంతో ఇప్పుడు శాస్త్రవేత్తలు అక్కడ ఎంత పరిమాణంలో నీరుందో తెలుసుకోవడంపై దృష్టిసారించనున్నారు. చంద్రయాన్- 1 సాధించిన ఫలితాలతో విశ్వంలో జీవం ఉనికికి సంబంధించిన పరిశోధనలు ఊపందుకుంటాయని భావిస్తున్నారు.

ఇస్రో చరిత్రలో చంద్రయాన్- 1 గొప్ప ముందడుగని భారత శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భూమి వెలుపల మరో ప్రాంతంలో నీటి జాడలు స్పష్టంగా గుర్తించడం ఇదే తొలిసారి. చంద్రయాన్- 1 సాధించిన ఈ ఘనతపై ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్ హర్షం వ్యక్తం చేశారు. చంద్రయాన్- 1లో మొత్తం 11 పరికారాలు ఉన్నాయని, ఇవన్నీ పంపిన సమాచారాన్ని విశ్లేషిస్తే మరిన్ని ఆసక్తికర అంశాలు తెలియవచ్చని చెప్పారు.

ఇదిలా ఉంటే చంద్రయాన్- 1 ప్రాజెక్టు డైరెక్టర్ మైలస్వామి అన్నాదురై మా బేబి విజయాన్ని సాధించిందన్నారు. వాస్తవానికి 40 ఏళ్ల క్రితమే చందమామపై అమెరికా శాస్త్రవేత్తలు నీటి జాడలు ఉన్నట్లు చెప్పారు. అపోలో యాత్రల సందర్భంగా చంద్రుడిపైకి వెళ్లిన అమెరికా వ్యోమగాములు భూమికి తెచ్చిన జాబిలి శిలల్లో నీటి ఆనవాళ్లు గుర్తించారు.

అయితే భూమికి తిరిగి వచ్చే సమయంలో ఈ శిలలు ఉంచిన పెట్టెలు ప్రమాదవశాత్తూ తెరుచుకున్నాయి. దీంతో వీటిపై గుర్తించిన నీటి జాడలు భూవాతావరణంలోనే ఏర్పడి ఉంటాయని అనుమానాలు వచ్చాయి. అయితే ఈ అనుమానాలను చంద్రయాన్- 1 పంపిన సమాచారంతో పటాపంచలయ్యాయి.

ప్రపంచం చాలా కాలం నుంచి విశ్వంలో జీవం కోసం అన్వేషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే జీవుల మనుగడకు అత్యంత కీలకమైన నీటిని అన్వేషించడంపై గత కొన్ని దశాబ్దాలుగా అంతరిక్ష శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. తాజా ఫలితాలతో నీటి ఆనవాళ్లు తెలుసుకునేందుకు జాబిలిపై మరిన్ని దేశాలు దృష్టిసారించే అవకాశం ఉంది.

Posted by Hollywood Actors


Posted by Hollywood Actors
Wednesday, September 23, 2009 at 1:24 AM | 0 comments  

























Posted by Hollywood Actors

దేశ రాజధాని వాసులు ప్రవర్తన మార్పుకోవాలని కేంద్ర హోం శాఖ మంత్రి పి.చిదంబరం సూచించారు. వచ్చే ఏడాది దేశ రాజధాని కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీని అంతర్జాతీయ స్థాయి నగరంగా మార్చేందుకు కామన్వెల్త్ క్రీడలను సరైన అవకాశమని, దీనిని రాజధానివాసులు సద్వినియోగ పరచాలని చిదంబరం పేర్కొన్నారు.

దీనికి ఢిల్లీ పౌరులు నడవడిక మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. కామన్వెల్త్ క్రీడలను ఆతిథ్యం ఇవ్వబోతున్న ఈ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి నగరంగా నిరూపించాలంటే రాజధానివాసులు తప్పనిసరిగా వారి ప్రవర్తన మార్చుకోవాలన్నారు. రాజధానిలో తరుచుగా పౌరులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తుంటారు.

ఇటువంటి వ్యవహారశైలిని విడిచిపెట్టాలి. చాలా ఏళ్ల నుంచి మేము రాజధాని పౌరులను గమనిస్తున్నాము. వారు నడవడికను ఏమాత్రం మార్చుకోలేదు. రెడ్ సిగ్నల్ ఉన్న వాహనాలు ఆగవు.

ముఖ్యంగా పోలీసు వాహనాలు కూడా ఆగవు. కొన్ని వాహనాలు రిజిస్ట్రేషన్ ప్లేట్లు లేకుండానే తిరుగుతుంటాయి. వెళ్లకూడని ప్రదేశాల్లోనూ వాహనాలు తిరుగుతుంటాయి. పౌరులు ప్రత్యమ్నాయ మార్గాలను ఉపయోగించరు. ఇటువంటి ఇష్టారాజ్యం నుంచి పౌరుల నడవడికను మార్చాల్సివుందని చిదంబరం అభిప్రాయప

Posted by Hollywood Actors
వై.యస్ నిజంగా దేవుడే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు మన ఆంధ్ర వై.యస్ ప్యాన్స్ నిన్నమొన్నటి దాక వింత వింత గా వారి వారి పద్దతిలో వై.యస్ కి నివాళులు అర్పిస్తు జగన్ సి.యం కావలంటు చేస్తుంటే అది అంత అతని పై ప్రేమే అనుకోవచ్చు కాని ఇరుముడ్లు కట్టు కొని మరి వై.యస్ కి నివాళులు అర్పించడం మరి అతిగా ఉంది ఇంత కంటే గొప్ప గొప్ప నాయకులు చనిపోయినప్పుడే ఇంత ఇలా చేయలేదు జగన్ ని సి.యం చేయలనుకోవడం మంచిదే అది కార్యకర్తలుగా ఉన్నారు కాబట్టి వారి బాధ్యత మరి దేవుడ్ని చేసి ఇరుముడిదాక వెళ్ళడం మరి అతి వై.యస్ భగవంతుడితో పోల్చడం వారి మేదస్సు కే వదిలేయాలి వారి తో రోజు తిరిగే నాయకులే నివాళ్ లు అర్పించి ఎవరి పనులు వారు చేసుకుంటుంటే సామన్యులు మీకేందుకయ్య ఇంత అతి అని నా భావన ఇదేదో సినిమా పాట ని ఖచ్చితంగా పాటిస్తున్నట్టు ఉంది ఆ డైలగ్ మన మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ నమ్మితే ప్రాణాలయిన ఇస్తాం నమ్మడమేర కష్టం అన్నట్టు ఉంది ఎంత లాభం పొందితే మరి ఇంతగా చూపించక్కర్లేదు అతని వల్ల నష్ట పోయిన వారు ఉన్నారు మరి వారి పరిస్తితి

Posted by Hollywood Actors
మీకు సచ్ కా సాం నా ప్రోగ్రాం తెలుసా అది మరి వికౄత రూపం దాల్చింది ఈ ప్రోగ్రాం షో లో ఒక మహిళ ఆత్మహత్య చేసుకునేదాక వారి ప్రశ్నలు వెల్తున్నాయ్ అంటే మరి ఈ షో ని ఆపేసే ప్రయత్నాలు ఎవరు చూపట్లేదు మనిషి యొక్క బలహీనత ని దెబ్బకొడుతు కోటి రూపాయల బహుమతిని ఆశాగా చూపుతు మానవ సంభందాలపై ప్రశ్నలు గుప్పిస్తు మానవ సంభంధాలను తుచ్చ రీతిన ప్రశ్నించే రీతిలో జరుగుతోంది ఇది సచ్ కా సాం నా ల లేదు హత్య కా పాస్ న అన్నట్టు ఉంది



Posted by Hollywood Actors
ప్రజారాజ్యానికి కొత్త కార్యవర్గాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఆదివారం ప్రకటించారు. సీనియర్ నేత పర్వతనేని ఉపేంద్ర నేతృత్వంలో ఏర్పాటైన కార్యవర్గంలో ఏడుగురు ఉపాధ్యక్షులు, తొమ్మిది మంది ప్రధాన కార్యదర్శులు, ఒక కార్యనిర్వాహక కార్యదర్శి ఉంటారు. ఆదివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిరంజీవి రాష్ట్ర కార్యవర్గాన్ని వెల్లడించారు. అలాగే, 15 జిల్లాలకు అధ్యక్షుల పేర్లను కూడా ప్రకటించారు. మిగిలిన జిల్లాలపై కసరత్తు జరుగుతోందని త్వరలోనే వారి పేర్లను కూడా ప్రకటిస్తాం . పార్టీ ఉపాధ్యక్షులుగా నియమితులైన వారిలో.. వంగవీటి రాధాకృష్ణ, కనకారావు మాదిగ, కెప్టెన్ మూర్తి, వి.వరప్రసాద్, మోహన్ రావు, అమర్ సింగ్ తిలావత్, దేవిశెట్టి శ్రీనివాస్‌లు ఉన్నారు. ప్రధాన కార్యదర్శులుగా ఉమామల్లేశ్వర రావు, పాదూరి కరుణ, బసవరాజు శ్రీనివాస్, కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎరావ్రతి అనిల్, బూరగడ్డ వేదవ్యాస్, రహ్మాన్, తోట త్రిమూర్తులు ఉన్నారు. అలాగే కార్యనిర్వాహక కార్యదర్శిగా ఏఎం.రాధాకృష్ణను నియమిస్తున్నట్టు చిరంజీవి తెలిపారు.


Posted by Hollywood Actors
టెక్కలి ప్రజలు వై.యస్.కి ఘనమైన నివాళి అర్పించారు టెక్కలి ఎన్నికలలో జగన్ పిలుపుకు స్పందించి కొర్ల భారతమ్మకు ఘనవిజయం అందించారు పొయిన సారి ఎన్నికలలో కంటే ఇ సారి ఇంక ఎక్కువ అధిక్యం ఇచ్చారు ఇ ఎన్నికలలో మొదటి స్థానంలో కాంగ్రెస్ రెండులో తెలుగుదేశం మూడులో ప్రజరాజ్యం మొన్న జరిగిన ఎన్నికల వరసే వచ్చింది కాంగ్రెస్ కి దక్కిన ఓట్లు 59250,తెలుగుదేశానికి 52077 ప్రజరాజ్యం 17858 లోక్ సత్తా 1277 వరుసగా నిలిచాయ్ ఈ విజయా వై.యస్.ఆర్ దేనని అందరూ అంటున్నారు ప్రజలలో వై.యస్ కి ఉన్న అభిమానమే ఈ గెలుపికి కారణమని చెబుతున్నారు ఈ విజయం అందించిన టెక్కలి ప్రజలకు వ.యస్.జగన్ కౄతజ్ణతలు తెలిపాడు పోయిన సారికంటే ఎక్కువ మెజార్టి రావటంతోనే ప్రజలో అభిమానం తెలుస్తోందని జగన్ చెప్పాడు

Posted by Hollywood Actors

Posted by Hollywood Actors
భారత్ గగనతలం, అంతర్జాతీయ సరిహద్దును చైనా మిలిటరీ ఉల్లంఘించినట్లు ఇటీవల భారత మీడియాలో జరిగిన ప్రచారంపై చైనా ప్రభుత్వ నడుపుతున్న ఓ ప్రధాన పత్రిక నిప్పులు చెరిగింది. ఆ పత్రిక గురువారం ప్రచురించిన ఓ కథనంలో భారత మీడియాను లక్ష్యంగా చేసుకుంది. ఇరుదేశాల మధ్య భారత మీడియా యుద్ధ కాంక్షను రెచ్చగొడుతోందని ఆరోపించింది. యుద్ధానికి సంబంధించిన వాక్పటిమ, ఇరుదేశాల మధ్య శతృత్వానికి బీజాలు వేసే చర్యల ద్వారా సినో- ఇండియా సంబంధాలను నిర్వీర్యపరుస్తోందని దుయ్యబట్టింది. భారత మీడియాను రోజూ పరిశీలిస్తుంటే... ఇరుదేశాల మధ్య యుద్ధం తప్పదనే ఆలోచన వస్తుందని చైనా డైలీ పత్రిక తన ఎడిటోరియల్‌లో పేర్కొంది. గత కొన్ని నెలలుగా భారత మీడియా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని అభిప్రాయపడింది. వాస్తవాన్ని తెలుసుకునే ప్రయత్నం, సమాచారం తెలియజేయడం, స్ఫూర్తిని రగిలించడం వంటి చర్యలను మానుకొని భారత మీడియా యుద్ధ వాక్పటిమను ప్రదర్శిస్తోందని ఆరోపించింది.

Posted by Hollywood Actors
టాలీవుడ్‌లో "ప్రేమికుడు" సరసన ప్రియురాలుగా "ఘరానా మొగుడు"కి భార్యగా నటించిన సెక్సీ నటి నగ్మా గుర్తుండే ఉంటుంది. ఇప్పుడామె మహారాష్ట్రలో రాజకీయ నాయకురాలు అవతారమెత్తింది.


మహారాష్ట్ర అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయనుంది. బుధవారం మహారాష్ట్రలోని తిలక్ భవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన సభకు నగ్మా హాజరైంది.

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల్లోకి ప్రవేశించి తళుక్కుమంటూ మెరుస్తున్న విజయశాంతి, జయసుధ వంటి నటీమణులను చూసిన నగ్మా, తను కూడా అదే బాటలో పయనిస్తోంది. అన్నట్లు రోజా రాజకీయ జీవితాన్ని నగ్మా చూసిందో లేదో...? ఆఁ... తెలుగు రాజకీయాలకు ముంబయి రాజకీయాలకు తేడా ఉంటుందనుకుంటుందో... చూద్దాం!! రాజకీయాల్లో నగ్మా "లక్" ఎలా ఉందో.


Posted by Hollywood Actors
ఆవేశం అనర్దం రోజా

రోజ పాపం అటు కాకుండ ఇటు కాకుండ పోయింది రాజకీయం అంటే సినిమాలో గంతులేడం అన్నంత ఈజీ అనుకుంది బోల్తపడింది తన పార్టి వారే నాయుకుడే వెన్నుపోటు పొడుస్తాడని అనుకోలేదుమరి అతిగ ఆవేశపడి అందరిని విరగ తిట్లు తిట్టేసింది చిరంజీవి అనిలేదు రాజశేఖర్ రెడ్డి అని లేదు తన స్థాయికి మించిన వారిని మిడియాలో అదేపనిగ కనబడి ఎన్నికలముందు తెగ తిట్టింది మరి నాయకుడి అండ ఉందనికొంది లేదని ఎన్నికలు అయిన తరువాత గాని తెలియలేదు ఎంటంటే సంగతి గల్ల అరునకుమారి లాంటి సినియర్ నేత ఎదురుగ నిలబెడితే తాను దీటుగ ఎదుర్కొగలను అని ఆవేశంతో నిల్చుంది ఓడిపోయింది.ప్రత్యక్ష రాజకీయాలకు కొంచెం కొత్త్తే అయిన రోజాకు ఎన్నికల సమయంలో ఈ విషయం తెలిసినట్టు లేదు. తెలుగుదేశం గుడ్ విల్, తన గ్లామర్ కలిసి తనను సులభంగా గట్టెక్కిస్తాయని ఆమె భావించారు. గల్లా అరుణ కుమారిపై రోజా గెలవలేదన్న విషయం చంద్రబాబు నాయుడికి ముందే తెలుసు. బరిలోకి దిగిన రోజా గ్లామర్ ను, కొంత సంపదను కోల్పోయింది.మరి ఎత్తులు జిత్తులు సినిమ వారికి అంత తొందరగ అర్దం కావుమరి అలాగే చిరంజీవి తన సభలకొచ్చిన జనాన్ని నమ్ముకొని మోసపోయాడు నెమ్మదిగ కొలుకొంటున్నాడు దాని సంగతి పక్కన పెడితే రోజ కి వై.యస్ చాల అన్యం చేశాడు తనకి తెలియకుండ పాపం రాజశేఖరుడు మరణిస్తానని తెలియక రోజకి ఆహ్వనం పలికేడు అది నిజం అనుకొని ఎన్నికల ముందు వీరిని తిట్టినట్టే ఎన్నికల తరువాత చంద్రబాబుని తిట్టేసి రాజినామ ఇచ్చేసింది హఠత్తుగ రాజన్న మరణవార్త విని నివ్వెర పోయి ఉంటూంది ఎటుగాని పరిస్తితి సరే అని మహిళా నేతలు ఉరూకుంటార అబ్బే స్త్రీలకు స్త్రీలే శత్రువులని ఉరికే అన్నార ప్రజరాజ్యం పార్టి మహిళ అధ్యక్షురాలు శొభరాణి,కాంగ్రెస్ తరపున గంగాభవాని రోజని మిడియా ముందే ప్రత్యక్షంగా ఆడుకుంటున్నారు ఇంక ముందు ముందు మళ్ళీ సినిమాలు టి.విలే గతి రోజ కి డబ్బు పోయి మర్యద పోయి ఇన్ని తిట్లు తిరస్కరాలు మరి రాజకీయమ మజాకన తెలిసొచ్చుంటుంది

Posted by Hollywood Actors
Visit the Site
MARVEL and SPIDER-MAN: TM & 2007 Marvel Characters, Inc. Motion Picture © 2007 Columbia Pictures Industries, Inc. All Rights Reserved. 2007 Sony Pictures Digital Inc. All rights reserved. blogger templates