Sunday, September 20, 2009 at 4:32 AM |  
ప్రజారాజ్యానికి కొత్త కార్యవర్గాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఆదివారం ప్రకటించారు. సీనియర్ నేత పర్వతనేని ఉపేంద్ర నేతృత్వంలో ఏర్పాటైన కార్యవర్గంలో ఏడుగురు ఉపాధ్యక్షులు, తొమ్మిది మంది ప్రధాన కార్యదర్శులు, ఒక కార్యనిర్వాహక కార్యదర్శి ఉంటారు. ఆదివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిరంజీవి రాష్ట్ర కార్యవర్గాన్ని వెల్లడించారు. అలాగే, 15 జిల్లాలకు అధ్యక్షుల పేర్లను కూడా ప్రకటించారు. మిగిలిన జిల్లాలపై కసరత్తు జరుగుతోందని త్వరలోనే వారి పేర్లను కూడా ప్రకటిస్తాం . పార్టీ ఉపాధ్యక్షులుగా నియమితులైన వారిలో.. వంగవీటి రాధాకృష్ణ, కనకారావు మాదిగ, కెప్టెన్ మూర్తి, వి.వరప్రసాద్, మోహన్ రావు, అమర్ సింగ్ తిలావత్, దేవిశెట్టి శ్రీనివాస్‌లు ఉన్నారు. ప్రధాన కార్యదర్శులుగా ఉమామల్లేశ్వర రావు, పాదూరి కరుణ, బసవరాజు శ్రీనివాస్, కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎరావ్రతి అనిల్, బూరగడ్డ వేదవ్యాస్, రహ్మాన్, తోట త్రిమూర్తులు ఉన్నారు. అలాగే కార్యనిర్వాహక కార్యదర్శిగా ఏఎం.రాధాకృష్ణను నియమిస్తున్నట్టు చిరంజీవి తెలిపారు.


Posted by Hollywood Actors

0 comments:

Visit the Site
MARVEL and SPIDER-MAN: TM & 2007 Marvel Characters, Inc. Motion Picture © 2007 Columbia Pictures Industries, Inc. All Rights Reserved. 2007 Sony Pictures Digital Inc. All rights reserved. blogger templates